ఐపిఎల్లో చెన్నై జట్టు కెప్టెన్సీకి మధ్యలోనే రాజీనామా చేసిన రవీంద్ర జడేజా ఇప్పుడు మిగతా ఐపిఎల్ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఢిల్లీతో మ్యాచ్కు జట్టులో లేని అతడికి గాయమైనట్లు సమాచారం. 33 ఏళ్ళ ఈ సౌరాష్ట్ర క్రికెటర్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఈ సీజన్లో చెన్నై జట్టు మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అదే సమయంలో అతడి ప్రదర్శన పట్ల ఆగ్రహంగా ఉన్న చెన్నై యాజమాన్యంతోనూ జడేజాకు మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం.