టీమిండియా క్రికెటర్ ఒక్కసారిగా రాజకీయాల్లోనూ ఎట్రాక్షన్ గా మారిపోయాడు. అతడి భార్య రివాబా గుజరాత్ లోని జామ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జడేజా సోదరి నైనబా కూడా ఇదే నియోజకవర్గం నుంచి.. సొంత మరదలిపై ప్రత్యర్ధి పార్టీ నుంచి పోటీకి దిగింది. ఈ క్రమంలోనే రివాబా.. తన ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను వాడుకుంటోందని, ఇది బాలకార్మిక చట్ట వ్యతిరేకం అని నైనభా సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అటు భార్, ఇటు సోదరి మధ్య మన క్రికెటర్ నలిగిపోతున్నాడు.