కీలక వడ్డీరేట్లను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ ప్రస్తుతం రెపో రేటును 4.40 శాతానికి పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకు వడ్డీ రేట్లు, లోన్ల ఈఎంఐలు కూడా పెరగనున్నాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఈ వడ్డీ రేట్లను పెంచుతున్నామని ఆర్బిఐ ప్రకటించింది. 2018 ఆగస్ట్ తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. మార్చి 2022లో హోల్ సేల్ ద్రవ్యోల్బణ రేటు 7 శాతానికి పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.