అత్యంత వేగంగా ఛార్జింగ్ ఎక్కే టెక్నాలజీ రియల్మీ పరిచయం చేయనుంది. ఏకంగా 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేసే జిటి నియో 3టి స్మార్ట్ఫోన్ను జూన్ 7న ఇండోనేసియాలో లాంచ్ చేయనుంది. అదే నెలలో భారత్లోనూ ఇదే పేరుతో దీనిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది రియల్ మీ. ఈ ఫోన్లోని 4500 బ్యాటరీ కేవలం 17 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ ఎక్కేస్తుందని పేర్కొంది. స్నాప్డ్రాగన్ 870 చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్లో 64 ఎంపి మెయిన్ కెమెరా ఉండనుంది.