ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం మరో రికార్డును నెలకొల్పింది. భారత్లో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన క్రికెట్ మ్యాచ్గా రికార్డులకెక్కింది. రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఐపిఎల్ ఫైనల్కు ఏకంగా 1,04,859 మంది ప్రేక్షకులు తరలి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఫుల్ కెపాసిటీతో మ్యాచ్లు నిర్వహించడం, అందులోనూ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం, ఐపిఎల్ ఫైనల్ కావడంతో ఈ రికార్డు సాధ్యమైంది.