మార్చి నెలతో ముగిసిన 2021 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ 22.5 శాతం లాభాన్ని గడించింది. దీంతో ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించిన తొలి భారత కంపెనీగా చరిత్ర సృష్టించింది. టెలికాం, డిజిటల్ సర్వీసుల్లో గణనీయ వృద్ధి కనిపించడంతో పాటు ఆయిల్ రిఫైనింగ్లో భారీ లాభాలు రావడంతో కంపెనీ లాభాల బాట పట్టింది. దీంతో 4వ త్రైమాసికంలో ఈ సంస్థకు రూ.16,203 కోట్ల లాభం వచ్చి చేరింది.