విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్ లపై ఎగుమతి సుంకాలను కేంద్రం విధించడంతో నేడు మార్కెట్లో ఓఎన్జీసీ, రిలయెన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపైనా ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, విండ్ ఫాల్ పన్నులను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ ఏకంగా 8.5 శాతం నష్టపోయింది. దీనికంటే ఓఎన్జీసీ స్టాక్ రేటు ఏకంగా 12.3 శాతం నష్టపోయి ఇన్వెస్టర్లకు భారీ నష్టాల్ని మిగిల్చింది. ఆయిల్ ఇండియా కూడా 11 శాతం, మంగళూరు రిఫైనరీ 10 శాతం నష్టపోయాయి.