భారత ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుడిగా మాజీ ఐఎఎస్ అధికారి తరుణ్ కపూర్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్కు చెందిన తరుణ్ కపూర్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన వారు. గతంలో పెట్రోలియం శాఖ కార్యదర్శిగానూ ఆయన పనిచేశారు. ఆయనను ప్రధానమంత్రి సలహాదారుడిగా నియమించినట్లు ఆల్ ఇండియా రేడియో సైతం ట్వీట్ చేశారు. వచ్చే 2 ఏళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. హరిరంజన్ రావు, అతీష్ చంద్రలను ప్రధాని కార్యాలయంలో అదనపు కార్యదర్శులుగా నియమితులయ్యారు.