అస్సాంలోని ఒరాంగ్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న ఓ మగ ఖడ్గ మృగం రక్తమోడుతున్న ఫొటోలపై కేసు నమోదైంది. ఈ ఖడ్గ మృగం కొమ్ముని వేటగాళ్లు కోసేశారని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటోందని తెలిపారు. చికిత్స పూర్తయిన తర్వాత ఈ రైనోను తిరిగి అడవిలోకి వదులుతామని తెలిపారు. 2017 తర్వాత రైనో లపై ఈ అటవీ ప్రాంతంలో దాడి జరగడం ఇదే తొలిసారి.