వరుసగా 5 ఓటముల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది. నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ను కోల్కతా బౌలర్లు కేవలం 152 పరుగులకే కట్టడి చేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా బ్యాటర్లు 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేధించింది. నితీష్ రాణా 48, రింకూ సింగ్ 42, శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో ధాటిగా ఆడారు.