డెహ్రాడూన్ హైవే పై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదానికి తీవ్ర గాయాలతో బయటపడ్డ క్రికెటర్ రిషబ్ పంత్ ను డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రిషబ్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. ఎయిర్ అంబులెన్స్ లో పంత్ ను త్వరలోనే ఢిల్లీకి తరలించనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోనే పంత్ కు చిన్నపాటి సర్జరీలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.