అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) క్రికెటర్లకు కొత్త అవార్డును తీసుకొచ్చింది. ప్రతీ నెలా జరిగే మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేసిన పురుషుల, మహిళల జట్ల నుంచి ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ను ఇవ్వనున్నట్లు తెలిపింది.
ICC announces ‘Player of the Month’ awards 🎉
Fans can have their say, alongside an expert panel!
Register on the ICC website to vote on the first of each month 🗳️
More 👇https://t.co/npYRT102dd
— ICC (@ICC) January 27, 2021
ఇందుకోసం ఐసిసి వెబ్సైట్లో నిర్వహించే పోల్ లో పాల్గొని క్రికెట్ అభిమానులు తమ అభిమాన ప్లేయర్కు ఓట్ వేయవచ్చు.
ఐసిసి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్, ఐసిసి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పేరిట ఈ అవార్డులను ఇవ్వనుంది. ఈ అవార్డుకు న్యాయనిర్ణేతలుగా మాజీ ఆటగాళ్ళు, బ్రాడ్కాస్టర్లు, అంతర్జాతీయ పత్రికల రిపోర్టర్లు ఉండనున్నారు.
జనవరి నెలకు పోటీలో ఉన్నది ఎవరంటే?
ఐసిసి తీసుకొచ్చిన ఈ కొత్త అవార్డుకు జనవరి నెలకు సంబంధించి ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన భారత ఆటగాళ్ళు ముందు వరుసలో ఉన్నారు.
తొలి టెస్ట్ సిరీస్ ఆడిన భారత ఆటగాళ్ళు మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, రిషబ్ పంత్, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బజ్ లతో పాటు ఇప్పటికే సీనియర్ ఆటగాళ్ళైన రవిచంద్రన్ అశ్విన్ (భారత్), జో రూట్ (ఇంగ్లాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), మరిజానే కాప్ (సౌత్ ఆఫ్రికా), నదీనే దె క్లెర్క్ (సౌత్ ఆఫ్రికా), నిదా దార్ (పాకిస్థాన్ల)లు పోటీ పడుతున్నారు.