వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడడని ఆ జట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. డిసెంబర్ 30న పంత్ ప్రయాణిస్తున్న వాహనం ఉత్తరాఖండ్ లో యాక్సిడెంట్ కు గురవ్వడం, ఇప్పటికీ అతడు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటుండడంతో అతడు ఐపిఎల్ ఆడతాడా? లేదా? అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో గంగూలీ పంత్ ఇప్పట్లో క్రికెట్ ఆడే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు.