పొద్దున్న లేచింది మొదలు ప్రజలపై పన్నుల భారంతో విరుచుకుపడే ప్రభుత్వాలు.. తాజాగా మరోసారి అదే దారిని ఎంచుకున్నాయి. త్రైమాసిక రోడ్ట్యాక్స్ను భారిగా పెంచుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారం సగటున 30శాతంపైనే ఉన్నట్లు వాహన యజమానులు చెబుతున్నారు. 6 టైర్ల లారీలకు రూ 3,940లుగా వున్న రోడ్ట్యాక్స్ను రూ 4,970లకు పెంచింది. అలాగే 10 టైర్ల లారీకి రూ.6,580లు వుంటే రూ.8,390లకు పెంచారు. అలాగే 12 టైర్లలారికి రూ.8,520ల నుండి రూ.10,910లకు, 14 టైర్ల లారీకి రూ.10,480ల నుండి రూ.13,430లకు పెంచారు.