భారత కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలు గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో ఈ నెల 22–26 మధ్య బంగ్లాదేశ్ తో జరిగే 2వ టెస్ట్ కు అందుబాటులోకి రానున్నాడు. బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్ 2వ మ్యాచ్ లో గాయపడ్డ అతడు 3వ వన్డే కు దూరమై ముంబై కు వచ్చి చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎంసిఎ లో నెట్ ప్రాక్టీస్ లో ఉన్న కెప్టెన్ త్వరలోనే బంగ్లాకు ప్రయాణమై.. జట్టుతో కలవనున్నాడు. రోహిత్ గైర్హాజరుతో కెఎల్.రాహుల్ కెప్టెన్సీ బాధ్యతల్లో ఉన్నాడు.