శ్రీలంకతో వచ్చే ఏడాది లో జరగనున్న హోం సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్ లు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ లో భారత్.. లంకేయులతో మూడు టి29లు, 3 వన్డేలు ఆడనుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ జనవరి 15తో ముగుస్తుంది. బంగ్లాతో మూడో వన్డేలో గాయపడ్డ రోహిత్ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం ఓ కారణమైతే.. అతియా శెట్టితో పెళ్ళి కోసం రాహుల్ సైతం ఈ సిరీస్ కు దూరంగా ఉండనున్నాడని సమాచారం.