రోహిత్​: టి20ల నుంచి ఇప్పట్లో తప్పుకోను

By udayam on January 10th / 11:45 am IST

టి20 ల నుంచి తప్పుకునే ఉద్దేశ్యం ఏదీ తనకు లేదన్నాడు భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ. శ్రీలంకతో నేటి నుంచి జరుగుతున్న వన్డే సిరీస్​ ప్రారంభానికి ముందు విలేకరులతో మాట్లాడిన అతడు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. తాను గైర్హాజరు కావడంతో టి20 సిరీస్​ కు హార్ధిక్​ పాండ్య ను ఎంపిక చేయడం వల్లే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయన్న అతడు.. 2023 ఐపిఎల్​ తర్వాత నా నిర్ణయం ఎలా ఉంటుందో నాకూ తెలియదు అని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లకు తగిన విశ్రాంతి అవసరమని మరోసారి స్పష్టం చేశాడు.

ట్యాగ్స్​