పంజాబ్లోని మొహాలీలో ఉన్న పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ భవనంపై సోమవారం రాత్రి రాకెట్ ప్రొపెల్లడ్ గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేనప్పటికీ పోలీస్ శాఖ నగరం మొత్తం హై అలెర్ట్ ప్రకటించి నిందితుల కోసం గాలిస్తోంది. ఈ పనికి పాల్పడి ఉగ్రవాదులు కూడా అయి ఉండొచ్చని పంజాబ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి 7.45 గంటలకు సెక్టార్ 77 లో ఉన్న ఈ బిల్డింగ్ వద్ద చిన్నస్థాయిలో పేలుడు సంభవించింది.