ప్రపంచ సినీ పండుగ ఆస్కార్ అవార్డులకు భారత్ నుంచి మొత్తం ఐదు సినిమాలు నామినేషన్లను పట్టేశాయి. వీటిల్లో రిషబ్ శెట్టి మూవీ కాంతారకు రెండు, రాజమౌళి ఆర్ఆర్ఆర్, వివేక్ అగ్నిహోత్రి మూవీ ది కశ్మీర్ ఫైల్స్, సంజయ్ లీలా భన్సాలీ గంగూభాయి ఖతియావాడితో పాటు భారత అధికారిక ఆస్కార్ ఎంట్రీ చెల్లో షోలు ఉన్నాయి. వీటితో పాటు మరాఠీ సినిమాలు మే వసంతరావు, తుజ్యా సాతి కహీ హై, ఆర్ మాధవన్ నటించిన రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్, ఇరావిన్ నిఝల్, కన్నడ సినిమా విక్రాంత్ రోనాతో పాటు డాక్యుమెంటరీ విభాగంలో భారత్ నుంచి ఆల్ దట్ బ్రీతెస్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూ చోటు దక్కింది. అయితే మొత్తం 301 సినిమాలకు నామినేషన్లు దక్కగా ఫైనల్ లిస్ట్ ను ఈనెల 26న ఆస్కార్ కమిటీ ప్రకటించనుంది.