ఐపిఎల్ మ్యాచ్ల కోసం డ్రీమ్ 11 యాప్లో బెట్టింగ్ కాసిన జమ్మూ కశ్మీర్ వసీమ్ రాజా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిపోయాడు. అతడికి ఈ యాప్లో రూ.2 కోట్ల బంపర్ ప్రైజ్ దక్కింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అతడిని అభినందనలతో ముంచెత్తారు. ‘గత రెండేళ్ళుగా ఐపిఎల్ టైమ్లో తాను డ్రీమ్ 11లో బెట్ చేస్తున్నా. ఈరోజు నాకు అదృష్టం బాగుంది’ అని వసీమ్ రాజా ఆనందం వ్యక్తం చేశాడు. ‘రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావడం ఆనందంగానే ఉంది’ అని చెప్పుకొచ్చాడు.