శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్స మద్దతుదారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వర్గానికి జరుగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అల్లర్లలో అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు అమరకీర్తి అథుకొరల మృతి చెందాడు. దేశ రాజధాని కొలంబో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెలరేగిన హింసలో ఇప్పటి వరకూ 79 మంది గాయపడ్డారు. కొంత మంది రాజపక్స మద్దతుదారులు కొన్ని గుడారాలను ధ్వంసం చేశారు. పోలీసులు వారిపై వాటర్ గన్స్, బాష్పవాయువులను ప్రయోగించారు.