తమిళ అగ్రనటుడు అజిత్ లేటెస్ట్ మూవీ ‘తెగింపు’ రన్ టైమ్ ను లాక్ చేశారు. 2.27 నిమిషాల పాటు ఈ మూవీ రన్ కానుందని తెలుస్తోంది. దొంగతనాలే ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మాతగా ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతికి విడుదల కానుంది. అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.