భారత్ తమ నుంచి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్న చమురును ఈ నెలలోనే రష్యా ఇక్కడికి పంపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈనెల 15వ తేదీ నుంచి 31 లోపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు.. రష్యాలోని రోస్నెఫ్ట్ సంస్థ 7 లక్షల టన్నుల ముడి చమురును పంపించనుంది. ఇందుకోసం లక్ష టన్నుల కార్గోస్ను తీసుకురాగల 7 షిప్పుల్ని రష్యా సిద్ధం చేసింది. వీటిని బాల్టిక్ తీరంలోని ప్రిమోర్స్క్, ఉస్ట్–లుగా నౌకాశ్రయాల నుంచి భారత్కు తరలించనుంది.