ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్య పేరుతో రష్యా జరుపుతున్న దండయాత్ర నేటితో 100 రోజులకు చేరింది. ఇప్పటివరకూ ఉక్రెయిన్లోని 20 శాతం భూభాగాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ వంద రోజుల్లో రోజుకు 100 మంది సైనికుల్ని తాము కోల్పోయామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వెల్లడించారు. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం ఆపడానికి పలుమార్లు శాంతి చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం దక్కలేదు. మరియుపోల్తో పాటు అజోవ్స్టల్ స్టీల్ ప్లాంట్ను రష్యా దక్కించుకుంది.