మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన ఆల్టైం గ్రేట్ ప్లేయింగ్ లెవెన్ను ప్రకటించాడు. ఈ జట్టులో తనకు కూడా చోటు ఇచ్చుకోని సచిన్.. కెప్టెన్గా తన మాజీ ప్లేయర్ సౌరవ్ గంగూలీని ఎంపిక చేసుకున్నాడు. సెహ్వాగ్, గవాస్కర్, లారా, వివ్ రిచర్డ్స్, కల్లిస్, గంగూలీ, గిల్ క్రిస్ట్, షేన్ వార్న్, వసీమ్ అక్రమ్, హర్భజన్, మెక్గ్రాత్లకు తుది జట్టులో చోటు ఇచ్చిన సచిన్.. భారత దిగ్గజ క్రికెటర్లు ధోనీ, కోహ్లీ, ద్రవిడ్లనూ పక్కన పెట్టేశాడు.