ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘సలార్’ ఈ నెలాఖరు నుంచి మరో షెడ్యూల్ షూటింగ్ను మొదలు పెట్టనుంది. మే 24 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి సలార్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లు సీన్ మేకింగ్పై చర్చిస్తున్న వీడియోను విడుదల చేశారు. శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలు జగపతి బాబు సైతం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.