కొచ్చిన్ లో జరుగుతున్న భారత ఐపిఎల్ మినీ వేలంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఐపిఎల్ వేలంలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లాండ్ యువ ప్లేయర్ సామ్ కుర్రాన్ ఈరోజు చరిత్ర సృష్టించాడు. అతడి కోసం పంజాబ్ జట్టు ఏకంగా రూ.18.5 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా యువ బ్యాటర్ కేమరూన్ గ్రీన్ ను ముంబై రూ.17.5 కోట్లు, బెన్ స్టోక్స్ కోసం చెన్నై రూ.16.25 కోట్లు ఖర్చు పెట్టింది. విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ను రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఐపిఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన కీపర్ గా అతడు రికార్డులకెక్కాడు.