భారత్లో తక్కువ ధరకు అమ్ముడుపోయే ఫీచర్ ఫోన్ల అమ్మకాలను నిలిపివేయాలని ప్రముఖ ఎలక్ట్రాకిక్ సంస్థ సామ్సంగ్ నిర్ణయించుకుంది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో ఈ కంపెనీ తన చివరి ఫీచర్ ఫోన్ బ్యాచ్ను పంపించనుందని, ఆ పై ఇక ఫీచర్ ఫోన్ అమ్మకాలు పూర్తిగా ఆపేస్తున్నట్లు పేర్కొంది. ఫీచర్ ఫోన్స్ ఆపేసిన తర్వాత సామ్సంగ్ రూ.15 వేల రేటున్న ఫోన్లను అధిక సంఖ్యలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.