సాయి కిరణ్ తెరకెక్కించిన హార్రర్ థ్రిల్లర్ మసూద సక్సెస్ ఫుల్ ధియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయిందని తెలుస్తుంది. ఈనెల 21 నుండి ఆహా లో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. ఈ స్పైన్ చిల్లింగ్ హార్రర్ థ్రిల్లర్ ఓటిటి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. తిరువీర్ రెడ్డి, కావ్యా కళ్యాణ్ రామ్, సంగీత, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్ ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు.