మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ నుంచి తొలి సాంగ్ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన జనవరి 26న మేకర్స్ ప్రకటన చేయనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్కు మహేష్ ఇటీవల కాస్త విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.