బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పాట పాడిన మహేష్ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఇప్పుడు ప్రైమ్లోకి వచ్చేసింది. అదేంటి ఎలాంటి ప్రచారం లేకుండా అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్.. ఈ మూవీని పే పర్ వ్యూ పద్దతిలో ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఒక్కసారి సినిమా చూడాలంటే రూ.199 చెల్లించి అద్దె ప్రాతిపదికన ఈ మూవీని స్ట్రీమ్ చేయొచ్చు. గతంలో కెజిఎఫ్ ఛాప్టర్ 2 ను కూడా ప్రైమ్లో ఈ విధంగానే స్ట్రీమ్ చేసిన సంగతి తెలిసిందే.