ట్రైలర్ : టైమింగ్​తో కుమ్మేసిన మహేష్​

By udayam on May 2nd / 11:11 am IST

ఈనెల 12న విడుదల కానున్న మహేష్​ బాబు మూవీ ‘సర్కారు వారి పాట’ నుంచి ట్రైలర్​ లాంచ్​ అయింది. తనకే సొంతమైన కామెడీ టైమింగ్​తో మహేష్​బాబు చెలరేగిపోయాడు. ఎపి సిఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిని ఇమిటేట్​ చేస్తూ ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’, ‘అందరూ నీలానే అనుకుంటున్నారు.. మెయింటెయిన్​ చేయలేక దూల తీరిపోతోంది’ అంటూ మహేష్​ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. కలెక్షన్​ ఏజెంట్​గా మహేష్​ నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్​, వెన్నెల కిషోర్​, సముద్రఖని, సుబ్బరాజులు నటించారు.

ట్యాగ్స్​