సౌదీ క్రౌన్ ప్రిన్స్ ముచ్చటపడి స్విట్జర్లాండ్ రాజు వద్ద కొన్న బోయింగ్ 747 లగ్జరీ విమానం తుక్కు తుక్కు కానుంది. 2005–11 మధ్య సౌదీకి క్రౌన్ప్రిన్స్గా ఉన్న సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సావూద్ దీనిని రూ.2,254 కోట్లకు కొన్నారు. అయితే అది ఆయన వద్దకు వచ్చేటప్పటికీ ఆయన మరణించారు. దీంతో 2012 నుంచి ఈ విమానం కేవలం 42 గంటల విమాన ప్రయాణాన్ని మాత్రమే జరుపుకుంది. పదేళ్ళుగా మూలనపడ్డ దీనిని తుక్కు కింద అమ్మేయాలని యువరాజు కుటుంబం నిర్ణయించింది.