ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బిఐ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును పది బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణ గ్రహీతలపై నెలవారీ వడ్డీ భారం పెరగనుంది. ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటును ఎస్బిఐ 10 బేసిస్ పాయింట్లు చొప్పున పెంచడం 10 రోజుల్లో ఇది రెండోసారి. తామిచ్చే రుణాలపై వడ్డీ రేటు రెపోను ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్లు పెంచిన నేపధ్యంలో ఎస్బిఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బిఐ తర్వాత మరిన్ని బ్యాంకులు సైతం ఇదే బాటలో నడవనున్నాయి.