సుప్రీం: జ్ఞాన్​వాపిలో నమాజ్​ను అడ్డుకోవద్దు

By udayam on May 18th / 6:09 am IST

కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్​వాపి మసీదు నీటి మడుగులో శివలింగం బయటపడ్డ వార్తలపై సుప్రీం స్పందించింది. శివలింగం బయటపడ్డ ప్రాంతం వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, అదే సమయంలో ఈ మసీదులో ముస్లింలు నమాజ్​ చేసుకోవడాన్ని అడ్డుకోరాదని పేర్కొంది. మే 19న తిరిగి ఈ కేసుపై విచారణ జరుపుతామని తెలిపింది. దీంతోపాటు జ్ఞాన్​వాపి మసీదు వీడియోగ్రఫీని కోర్టుకంటే ముందు మీడియాకు లీక్​ చేసిన అడ్వొకేట్​ కమిషనర్​ అజయ్​ కుమార్​ మిశ్రాను ఈ విచారణ నుంచి తొలగించింది.

ట్యాగ్స్​