సేమ్ సెక్స్ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టాల కింద తమ వివాహాలను గుర్తించాలని పేర్కొంటూ రెండు గే జంటలు కోర్టు మెట్లెక్కడంతో సుప్రీం సెంటర్ కు నోటీసులు జారీ చేసింది. వీళ్ళ వివాహాలను ఎందుకు చట్ట ప్రకారం గుర్తించకూడదో కేంద్రం తమ జవాబులో వెల్లడించాలని పేర్కొంది. చీఫ్ జస్టిస్ డివై.చండ్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లీల బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.