నోట్ల రద్దు చెల్లుబాటు నిర్ణయాన్ని తప్పుబట్టలేమని 4:1 మెజార్టీతో సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. 2016లో నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. పిటిషన్లపై సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యులతో డిసెంబర్ 7న విచారణను పూర్తి చేసి, తీర్పు రిజర్వ్ చేసింది. ఈ మేరకు సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ ఎఎస్ బోపను, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరతులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 382 పేజీల తీర్పు వెలువరించింది.