పంజాబ్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. 32 ఏళ్ళ క్రితం నాడు 1988లో నడి రోడ్డుపై సిద్ధూ చేసిన హంగామా కేసులో సుప్రీంకోర్ట్ ఈ శిక్షను విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధిత కుటుంబం వేసిన రివ్యూ పిటిషన్కు ఓకే చెప్పిన సుప్రీం.. తాజాగా సిద్ధూను దోషిగా తేల్చింది. శిక్ష ప్రకటన సమయంలో తనకు జైల్ శిక్ష విధించవద్దని సిద్ధూ ప్రాథేయపడ్డాడు. ఈ గొడవలో పటియాలాకు చెందిన గుర్నాం సింగ్ అనే వ్యక్తి మరణించారు.