బీహార్ లోని బౌద్ధుల పవిత్ర పుణ్యక్షేత్రం బుద్ధ గయ లో గురువారం నుంచి మూడు రోజుల పాటు పర్యటిస్తున్న దలైలామా పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పర్యటనలో దలైలామా కదలికలు తెలుసుకోవడానికి ఇప్పటికే బుద్ధగయకు చైనా నుంచి ఓ మహిళా గూఢచారి వచ్చి ఉందన్న అనుమానాలతో స్థానిక పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. చైనా మహిళ స్కెచ్ తో పాటు, ఆమె పాస్ పోర్ట్ వివరాలను కూడా పోలీసులు విడుదల చేశారు. గత రెండేళ్ళుగా ఆమె బుద్ధ గయ లోనే ఉంటోందని తెలుస్తోంది.