కోహ్లీకి గట్టి షాక్​ ఇవ్వనున్న సెలక్టర్లు!

By udayam on May 10th / 10:46 am IST

ఫామ్​ లేమితో సతమతమవుతున్న దిగ్గజ క్రికెటర్​ విరాట్​ కోహ్లీకి సెలక్టర్లు షాక్​ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఐపిఎల్​ ముగిసిన వెంటనే ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా, ఐర్లాండ్​ సిరీస్​లకు అతడికి ‘విశ్రాంతి’ని ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక రకంగా ఇది అతడిపై వేటు వేయడమేనని తెలుస్తోంది. గతంలో రహానే, పూజారాలను సైతం ఇలానే తప్పించిన సెలక్టర్లు ఇప్పుడు కోహ్లీకి అదే ట్రీట్​మెంట్​ ఇవ్వనున్నారు. ఐపిఎల్​లో ఇప్పటి వరకూ 12 మ్యాచులు ఆడిన కోహ్లీ 19 సగటుతో 216 పరుగుల చేశాడు.

ట్యాగ్స్​