దేశీయ మార్కెట్లకు ఈరోజు బ్లాక్ థర్స్డే గా గుర్తుండిపోతుంది. గత 2 సెషన్లలో లాభపడ్డ సెన్సెక్స్ ఈరోజు ఏకంగా 1400 ల పాయింట్లు, నిఫ్టీ 430 పాయింట్లు నష్టపోయాయి. ఈ ఒక్కరోజే మార్కెట్లో మదుపరుల సంపద రూ.7 లక్షల కోట్లు ఆవిరయ్యింది. అమెరికాలో తిరిగి మాంద్యం వస్తుందన్న వార్తలకు తోడు, అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలు భారత మార్కెట్లను దెబ్బకొట్టింది. అత్యధికంగా ఐటీ, లోహ రంగ షేర్లు 4 నుంచి 5 శాతం మేర నష్టాలు చవిచూశాయి.