భారతీయులకు సెర్బియా షాక్​.. వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు

By udayam on December 26th / 10:16 am IST

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ని రద్దు చేస్తున్నట్లు యూరోపియన్​ దేశం సెర్బియా ప్రకటించింది. ఇకపై వీసా ఉంటేనే తమ దేశంలోకి ఆహ్వానిస్తామని షాక్​ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఈ యూరోపియన్​ దేశంలోకి భారతీయులు వీసా లేకుండానే వీలుండేది. యూరోపియన్​ యూనియన్​ లో మారిన వీసా రూల్స్​ ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెర్బియా వెల్లడించింది. వీసా లేకుండా మా దేశంలోకి ఇప్పటికే వచ్చిన వారు కేవలం 30 రోజుల్లో తమ పర్యటనను ముగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్స్​