268కి పెరిగిన ఇండోనేషియా భూకంప మృతులు..చిన్నారులే అధికం

By udayam on November 23rd / 5:33 am IST

ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావా పశ్చిమ భాగంలో సోమవారం వచ్చిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 268కి చేరింది. సియాంజుర్ పట్టణానికి సమీపంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు రాగా, భారీ నష్టం వాటిల్లింది. తొలుత 44 మంది మరణించారని అధికారులు చెప్పగా, ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. థిలాల కింద మృతదేహాలు ఉండొచ్చని, మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు. ఇంకా 151 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఇండోనేషియా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ భూకంపం సృష్టించిన విధ్వంసంలో 1000 మంది వరకు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.

ట్యాగ్స్​