తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నట్లు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల ప్రకటించారు. ఇక్కడే పార్టీ కార్యాలయం కోసం ఈనెల 16న భూమి పూజ చేస్తానన్న ఆమె పార్టీ విధానాలను ఆరోజు ప్రకటిస్తానని తెలిపారు. మరో వైపు షర్మిల జరుపుతున్న పాదయాత్రను అడ్డుకున్న పోలీసులపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమె పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే.