పంజాబ్ కింగ్స్ సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఐపిఎల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్న రాత్రి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 60 పరుగులతో నాటౌట్గా ఉన్న అతడు తన కెరీర్లో మొత్తం 49 సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. దీంతో ఇప్పటి వరకూ 48 హాఫ్ సెంచరీలతో భారత్ తరపున అగ్రస్థానంలో ఉన్న కోహ్లీని ధావన్ దాటేసినట్లయింది. కోహ్లీ 217 మ్యాచుల్లో 48 సార్లు 50 పరుగులు సాధించగా.. ధావన్ 202 ఇన్నింగ్సుల్లోనే 49 సార్లు 50 పరుగులు సాధించాడు.