భారత యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డ్ లకెక్కాడు. 2022 ఏడాదిలో అతడు 1489 రన్స్ చేసి సూర్య కుమార్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. ఈరోజు బంగ్లాదేశ్ తో మొదలైన తొలి టెస్ట్ లో శ్రేయస్ 86 పరుగులతో నాటౌట్ గా ఉన్న విషయం తెలిసిందే. అయ్యర్ తర్వాత సూర్యకుమార్ 1424, కోహ్లీ 1304, రిషబ్ పంత్ 1278, రోహిత్ శర్మ 995 రన్స్ తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.