బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న పెళ్ళి పీటలెక్కనున్నట్లు సమాచారం. వీరి పెళ్ళికి రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్యాలెస్ హోటల్ ను కూడా ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వీరిద్దరూ తమ బంధాన్ని ఎక్కడా ఓపెన్ కాకపోయినప్పటికీ ఇటీవల జరిగిన కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ షో లో వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు సిద్దార్థ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.