పంజాబ్ పాప్ సింగ్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూస్వాలాను తానే హత్య చేశానని గ్యాంగ్స్టర్ సచిన్ బిష్ణోయి అంగీకరించాడు. ‘అతడు నా తమ్ముడిని చంపినవాడు. అందుకే అతడిని అంతమొందించా’ అని న్యూస్18కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్కు చెందిన సచిన్ బిష్ణోయి.. ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ హత్య చేశానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న సచిన్ వర్చువల్ కాల్ ద్వారా న్యూస్18తో మాట్లాడాడు.