బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ కృష్ణకుమార్ కున్నథ్ (కెకె) అంత్యక్రియలు ఈరోజు బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలో ముగిశాయి. మంగళవారం రాత్రి కోల్కతాలో ఓ కన్సర్ట్లో పాటలు పాడిన ఆయన అనంతరం హోటల్ రూమ్లో అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం వెర్సోవా హిందూ స్మశాన వాటికలో జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆయన భార్య రేఖ, నిర్మాత అశోక్ పండిట్, జావెద్ అక్తర్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్లు హాజరయ్యారు.