పంజాబ్ పాపులర్ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్యకు సంబంధించి పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. నిన్న సాయంత్రం అతడు కార్లో బయటకు వెళ్తున్న ఆయనపై దాదాపు 8 నుంచి 10 మంది అతడిపై 30 రౌండ్లు కాల్పులు జరిపారని తెలుస్తోంది. అన్ని రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత కూడా దుండుగులు బైక్ దిగి అతడు చనిపోయాడా లేదా అన్నదీ చెక్ చేశారని, ఆ తర్వాతే ఘటనా స్థలం నుంచి పారిపోయారని తెలుస్తోంది. ఇప్పటికే ఆరుగురు నిందితులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.